Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎల్ఐసీ ఐపీఓను వెంటనే వెనక్కి తీసుకోవాలనీ, ప్రయివేటీకరణ చర్యలను ఆపాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు ఎంతో నమ్మకమైన ఎల్ఐసీ ప్రయివేటీకరణ సరిగాదని పేర్కొన్నారు. 40 కోట్ల మంది పాలసీదారులకు సంబంధించిన రూ.39.5 లక్షల కోట్ల ఆస్తులను కొద్ది మంది విదేశీ, స్వదేశీ కార్పొరేట్ శక్తులకు కారుచౌకగా అప్పగించే కుట్ర దీనికి వెనుక దాగి ఉందని విమర్శించారు. ఈ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. పాలసీదారుల అనుమతి లేకుండా వారి ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రశ్నించారు. తక్షణమే ఎల్ఐసీ ఐపీఓను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.