Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రఘునాథపల్లి
జనగామ జిల్లా రఘనాథపల్లి మండలం ఖిలాషాపురం గ్రామ శివారులో పొలం కోస్తున్న హార్వెస్టర్ ప్రమాద వశాత్తు దగ్ధమైన సంఘటన మంగళ వారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన పగుడాల పరమాత్మ అనే రైతు వ్యవసాయ భూమిలో వరి కోస్తుండగా హార్వెస్టర్కు విద్యుత్ తీగలు తగిలి షార్ట్ సర్క్యూట్కు గురై హార్వెస్టర్ కాలి బూడిదయింది. నర్సింహులు పొలం పరమాత్మ కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. రఘనాథపల్లి మండలం మాదారం గ్రామానికి చెందిన ఎండీ.అస్లాం హర్వెస్టర్తో పనులు చేయస్తుండగా ఘటన జరిగింది. హార్వెస్టర్ పూర్తిగా కాలిపోవడంతో అస్లాం బోరున విలపించారు.