Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టులకు మూడోరోజు బుధవారం ఆన్లైన్లో 19,890 దరఖాస్తులొచ్చాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కార్యదర్శి అనితా రామచంద్రన్ ఒక ప్రకటన విడుదల చేశారు. గతనెల 26వ తేదీన 503 పోస్టుల భర్తీకి తెలంగాణ తొలి గ్రూప్-1 నోటిఫికేషన్ను టీఎస్పీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. దరఖాస్తుల సమర్పణకు తుదిగడువు ఈనెల 31వ తేదీ వరకు అవకాశమున్నదని పేర్కొన్నారు.
వన్టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్)కు సంబంధించి కొత్తగా 76,209 మంది, సవరణ చేసుకున్న వారు 1,67,090 మంది కలిపి 2,43,299 మంది అభ్యర్థులు వివరాలను అప్లోడ్ చేశారని వివరించారు. ఇతర వివరాలకు షషష.్రజూరష.స్త్రశీఙ.ఱఅ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.