Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను కేంద్రంలోని బీజేపీ అమలు చేయడం లేదనీ, ఆ పార్టీని నిలదీయడంలో కాంగ్రెస్ విఫలమైందని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్కసుమన్ విమర్శించారు.
గురువారం హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీపై ఈగ వాలకుండా కాంగ్రెస్ పార్టీ కాపాడుతున్నదని ఆరోపించారు. విభజన చట్టం హామీలపై బీజేపీ వైఖరి చెప్పాకే ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జే.పీ.నడ్డా రాష్ట్రంలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై రాహుల్ గాంధీ ఎందుకు పోరాడలేదని ప్రశ్నించారు.
కరెంటు కోతలతో సతమతమవుతున్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై దష్టి పెట్టాలని సూచించారు. మరో ప్రభుత్వ విప్ గువ్వుల బాలరాజు మాట్లాడుతూ రాహుల్ గాంధీకి సంబంధించిన వైరల్ అవుతున్న నైట్క్లబ్ వీడియోపై రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాలని సవాల్ చేశారు.