Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీజీ విజిలెన్స్ ద్వారా విచారణ చేపట్టాలి
- ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
యాదాద్రి ఆలయ నిర్మాణంలో జరిగిన అవకతవకలు, అవినీతిపై డీజీ విజిలెన్స్ ద్వారా విచారణ జరిపించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం పద్మనాభరెడ్డి డిమాండ్ చేశారు.ఈ మేరకు ఆయన గురువారం రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. బుధవారం సుమారు ఎనిమిది సెంటీ మీటర్ల వర్షం కురిసిందనీ, దీంతో యాదాద్రి ఆలయం అతలాకుతలమయిందని పేర్కొన్నారు. ఘాటు రోడ్డు కుంగిపోవటంతో పాటు ఆలయ ముఖ మండపం, క్యూ కాంప్లెక్స్, ప్రసాద విక్రయ శాలలోకి నీళ్లు వచ్చాయని తెలిపారు. ఎండాకాలంలో వచ్చిన ఒక్క వర్షానికే ఈ పరిస్థితి నెలకుంటే..వర్షాకాలంలో భారీగా వర్షాలు కురిస్తే ఆలయం పరిస్థితి ఏంటనీ ప్రశ్నించారు. గత ఆరేండ్లుగా సుమారు రూ. 1200కోట్లు ఖర్చుపెట్టి పనులు పూర్తి చేశారని పేర్కొన్నారు. ఈ పనుల్లో ప్రభుత్వ పెద్దలు తమవారికి కాంట్రాక్టులు కట్టబెట్టటం, అవనీతి, తరుచుగా డిజైన్లు మార్చటంతో పనిలో నాణ్యత లోపించిందని భావిస్తున్నామని తెలిపారు.దీనిపై తక్షణం విచారణ చేపట్టాలని కోరారు.