Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తప్పిన పెను ముప్పు
రనవతెలంగాణ-గణపురం
జయశంకర్-భూపాలపల్లి జిల్లా గణపురం మండంలం చెల్పూర్లోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం(కేటీపీపీ) రెండోదశ 600 మెగావాట్ల ప్లాంట్లో మరోసారి గరువారం అగ్నిప్రమాదం జరిగింది. తార్మినార్ బాక్స్లో మంటలు చెలరేగడంతో వెంటనే గమనించిన అధికారులు మంటలను ఆర్పేశారు. దాంతో పెద్ద ప్రమాదం తప్పింది. గురువారం మధ్యాహ్నం 600 మెగావాట్ల ప్లాంట్లో బాయిలర్ వద్ద ఉండే యాష్ హ్యాండ్లింగ్ సిస్టంలోని బాటమ్ యాష్ ఓవర్ ఫ్లో పంపు మోటార్ తార్మినార్ బాక్స్ నుంచి మంటలు చెలరేగాయి. వెంటనే అక్కడ ఉన్న కార్మికులు అధికారులకు చెప్పి, కేటీపీపీ ఫైర్ ఇంజన్లకు సమాచారం అందించారు. వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. పది రోజుల కిందట కేటీపీపీలో ఫైర్ ఆక్సిడెంట్లో ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా.. ఇందులో ఒకరు మృతిచెందిన విషయం తెలిసిందే.