Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక శాఖ అడిషనల్ కమిషనర్కు సీఐటీయూ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్యుత్ శాఖలోని బిల్ కలెక్టర్లు, మీటర్ రీడర్స్, ఎన్పీఎం, స్టోర్స్, అన్మెన్ కార్మికులకు కనీస వేతనాలు నిర్ణయించి అమలుచేయాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు కార్మిక శాఖ అడిషనల్ కమిషనర్ ఇ. గంగాధర్ను కలిసి వినతిపత్రం అందచేసినట్టు టీఎస్యూఈఈయూ (సీఐటీయూ) రాష్ట్ర కార్యదర్శి, గౌరవాధ్యక్షులు భూపాల్, డిప్యుటీ జనరల్ సెక్రటరీ కె రమేశ్ తెలిపారు. విద్యుత్ శాఖ పరిధిలోని ఎస్పీడీసీఎల్, ఎన్పీడీడసీఎల్ అధికారులకు, కాంట్రాక్టు ఏజెన్సీలకు నోటీసులు పంపి తగిన చర్యలు తీసుకుంటామని గంగాధర్ హామీ ఇచ్చినట్టు తెలిపారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోకపోతే ఆందోళనలకు దిగుతామని ఈ సందర్భంగా భూపాల్ చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఎస్యూఈఈయూ నాయకులు కె రాజేశ్వర్, హుస్సేన్, నాగమణి, రవి, సంతోష్, శివాని తదితరులు పాల్గొన్నారు.