Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో 2022-24 బ్యాచ్ ప్రవేశాల కోసం డీసెట్కు అభ్యర్థుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఈ మేరకు డీసెట్ కన్వీనర్ శ్రీనివాసాచారి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల తొమ్మిదో తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతందని తెలిపారు. వాటి సమర్పణకు తుదిగడువు వచ్చేనెల 30వ తేదీ వరకు ఉందని పేర్కొన్నారు. ఇతర వివరాలకు http://deecet.cdse.telangana.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు. జులై 23న రాతపరీక్ష ఉంటుందని తెలిపారు.