Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సరూర్నగర్లో నాగరాజును హత్య చేసిన నిందితుల్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేశ్ కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నిందితుల్ని 24 గంటల్లోపే పట్టుకున్న రాచకొండ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే ఎవరైనా శిక్షార్హులేనని పేర్కొన్నారు.
చంపడం, దాడులు చేయడం సమస్యలకు అంతిమ పరిష్కారం కాదనీ, పరమత సహనం మనందరికీ శ్రేయస్కరమని తెలిపారు.