Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వృద్ధురాలు మృతి
నవతెలంగాణ-మద్నూర్
షార్ట్సర్క్యూట్తో ఇల్లు దగ్ధమై వృద్ధురాలు మృతిచెందింది. ఈ విషాదకర ఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని పెద్దఎక్లార గ్రామంలో శనివారం తెల్లవారుజామున జరి గింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సుజలబాయి(93) కొడుకులు, కోడళ్లు శుభాకార్యానికి వెళ్లారు. వృద్ధురాలు ఒక్కరే ఇంట్లో ఉన్నారు. తెల్లవారుజామున షార్ట్సర్య్కూట్తో మంటలు వ్యాపించగా.. గదుల్లో పొగనిండిపోయింది. నిద్రలో ఉన్న సుజలబాయి గాయపడింది. దాంతోపాటు ఊపిరాడక మృతిచెందింది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.