Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 31న ప్రవేశ పరీక్ష
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీసీ గురుకుల విద్యాలయాల సంస్థల్లో ఇంటర్ , డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఈ నెల 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆ సంస్థ కార్యదర్శి మల్లయ్య భట్టు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్షను 31న నిర్వహించనున్నట్టు బీసీ బాలబాలికల గురుకుల కాలేజీల్లో 2022-23 విద్యాసంవత్సరానికి ఇంటర్లో చేరాలనుకునే విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. డిగ్రీ కోర్సుల కోసం కేవలం బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వారికి జూన్ ఐదున ప్రవేశపరీక్ష నిర్వహిస్తామన్నారు. ప్రవేశపరీక్షలో వచ్చిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస,ి సీట్లు కేటాయిస్తామని తెలిపారు. ఇంటర్లో చేరాలనుకునే విద్యార్థులు ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2021-22 సంవత్సరంలో పదో తరగతి చదివి ఉండాలని గుర్తుచేశారు. డిగ్రీలో చేరాలనుకునే వారు తప్పనిసరిగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలో 2021-22 సంవత్సరంలో ఇంటర్ చదివి ఉండాలని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల, సంరక్షకుల సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు రూ.1,50,000/- పట్టణ ప్రాంత విద్యార్థులకు రూ.2,00,000/-కు మించరాదని పేర్కొన్నారు. పూర్తి వివరాలు, దరఖాస్తుల కోసం mjptbcwreis.telangana.gov.in వెబ్ సైట్ను చూడాలని సూచించారు. ఏదైనా సందేహాలు ఉంటే మహాత్మా జ్యోతిబాఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయం కార్యాలయ ఫోన్ నెంబరు 040-23322377, 23328266లో సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.