Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మల్లు రవి, బెల్లయ్యనాయక్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు డిక్లరేషన్ను అమలు చేస్తారనే నమ్మకం ప్రజల్లో పెరిగిందని ఆ పార్టీ పేర్కొంది. ఇప్పటికే ఛత్తీస్ఘడ్లో తమ ప్రభుత్వం దీన్ని అమలు చేస్తున్నదని తెలిపింది. సోమవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో పార్టీ నేతలు మల్లురవి, బెల్లయ్యనాయక్, హర్కర వేణుగోపాల్, బొరెడ్డి అయోధ్యరెడ్డి, నూతి శ్రీకాంత్ తదితరులు విలేకర్లతో మాట్లాడారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడమనేది దేశంలో ఎక్కడా లేదని చెప్పారు. రైతు డిక్లరేషన్ ప్రకటనతో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఉలిక్కి పడుతున్నాయనీ, అందుకే రాహుల్పై టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని తెలిపారు.ఆ రెండు పార్టీలు నాయకులు చిల్లర మాటలు మానుకొకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిఘటన తప్పదని వారు హెచ్చరించారు.