Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ, సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన
నవతెలంగాణ- ఎల్బీనగర్
పెంచిన వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణం ప్రభుత్వాలు తగ్గించాలని సీపీఐ(ఎం), సీఐటీయూ డిమాండ్ చేశాయి. పలుచోట్ల మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టాయి. సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ ఎల్బీనగర్ రింగ్రోడ్డు వద్ద నేతలు నిరసన చేపట్టారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కీసరి నర్సిరెడ్డి, ఎల్బీనగర్ సర్కిల్ కన్వీనర్ ఆలేటి ఎల్లయ్య మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరల భారాలను ప్రజలపై మోపుతూ, పేదలను దోస్తూ ఈ ఎనిమిదేండ్ల కాలంలో రూ. 80 లక్షలకు కోట్లకుపైగా కార్పొరేట్ శక్తులకు దోచి పెట్టిందని విమర్శించారు. కార్పొరేట్లకు రాయితీలిస్తూ, పేదలపై భారాలు మోపడం దారుణమన్నారు. తక్షణమే పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, ఇతర నిత్యావసరాల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మేలు చేయడంలో అన్ని రంగాల్లోనూ విఫలమైన బీజేపీ సర్కార్ నేడు, కార్మి కుల, ప్రజల మధ్య తగాదాలు సృష్టించేందుకు, ఉద్రిక్తతలను పెంచేలా వ్యవహరిస్తోందన్నారు. ఇటువంటి చర్యలను ఖండించి ప్రజల్లో, కార్మి కుల్లో ఐక్యతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ అడ్డా (సీఐటీయూ) అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ వెంకన్న, శ్రీని వాస్, మున్న, గోపి, సీహెచ్ మల్లేశ్, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. హన్మకొండలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పలయ్య తరదితరులు పాల్గొన్నారు.