Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టులకు ఆన్లైన్లో 66,553 దరఖాస్తులొ చ్చాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కార్యదర్శి అనితా రామచంద్రన్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గతనెల 26న 503 పోస్టుల భర్తీకి తెలంగాణ తొలి గ్రూప్-1 నోటిఫికేషన్ను టీఎస్పీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. దరఖాస్తుల సమర్పణకు తుదిగడువు ఈనెల 31 వరకు అవకాశమున్నదని పేర్కొన్నా రు. వన్టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్)కు సంబంధించి కొత్తగా 95,518 మంది, సవరణ చేసుకున్న వారు 2,02,004 మంది కలిపి 2,97,522 మంది అభ్యర్థులు పూర్తి చేసుకున్నారని వివరించారు.