Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూ తగాదాలే కారణమన్న పోలీసులు
నవతెలంగాణ- బాలానగర్
భూమి తనపై రాయనన్నందుకు ఆవేశంలో ఓ కొడుకు కన్న తల్లిని కడతేర్చాడు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండల పరిధిలోని గండిగుంట తండాలో మంగళవారం జరిగింది. ఎస్ఐ విజయప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. కుంటలంపు తండా గ్రామ పంచాయతీ అమ్లెట్ గండిగుంట తండాకు చెందిన సబ్వత్ కమ్లి(35)కి ఒక్కడే కొడుకు సంతోష్. అతను కూలిపని చేస్తున్నాడు. సంవత్సరం కిందట పెండ్లి చేసుకున్నాడు. భార్యాభర్తల మధ్య తగాదా రావడంతో ఆమె పుట్టింటికెళ్లింది. తల్లి పేరున ఉన్న రెండెకరాల భూమి తనపై రాయాలని ఆమెతోనూ గొడవపడ్డాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఆవేశంలో మంగళవారం ఉదయం ఇంట్లోనే గొడ్డలితో తల్లిని నరికి చంపాడు. మృతురాలి సోదరుడు గుడిబండ తండాకు చెందిన రాము ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ విజయప్రసాద్ తెలిపారు.