Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పదో తరగతి వార్షిక పరీక్షలు ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చేనెల ఒకటో తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. పదో తరగతి విద్యార్థుల హాల్టిక్కెట్లు www.bse.telangana.gov.in వెబ్ సైట్లో గురువారం నుంచి డౌన్లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంటాయని వివరించారు. హాల్టిక్కెట్లతోపాటు ముద్రించిన నామినల్ రోల్స్ను సంబంధిత పాఠశాలలకు బుధవారం నాటికి పంపించామని పేర్కొన్నారు. ఆ పాఠశాల హెడ్మాస్టర్ల నుంచి విద్యార్థులు హాల్టిక్కెట్లను తీసుకోవచ్చని సూచించారు. ఈ పరీక్షలకు 5,09,275 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు.