Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
అమెరికాలోని సీటెల్ నగరంలో ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండిస్టియల్ అండ్ సిస్టమ్స్ ఇంజినీర్స్ వార్షిక సదస్సులో ప్యానెల్ సభ్యుడిగా వ్యవహరించడానికి ఆసియా ప్రాంతం నుంచి హైదరాబాదుకు చెందిన డాక్టర్ అల్లూరి వి.వి.ప్రసాద రాజు ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం కౌన్సిల్ చైర్మెన్ డేవిడ్ పొయిరియర్ నుంచి ఆహ్వానం అందుకున్నారు. ఈ సదస్సులో 83 దేశాల నుంచి 385 మంది ఇండిస్టియల్ ఇంజినీరింగ్ మేధావులు సమర్పించే పత్రాలపై చర్చలు జరుగుతాయి. హైదరాబాద్లోని హెచ్ఈఎస్ ఇన్ఫ్రా లిమిటెడ్ సంస్థకు డాక్టర్ అల్లూరి వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. ఆయనకు 45 ఏండ్లుగా ఇండిస్టియల్ ఇంజినీరింగ్ అండ్ సిస్టమ్స్ మేనేజ్మెంట్లో విశేష అనుభవం ఉంది.