Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వ్యవసాయ యాంత్రీకరణలో ఈజిప్టు దేశం ముందున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చెప్పారు. 95శాతం ఏడారిగా ఆదేశం ఐదు శాతం భూమిలో అద్బుతాలు సృష్టిస్తున్నదని కొనియాడారు. ఈజిప్టు రాజధాని కైరోలో జరుగుతున్న అంతర్జాతీయ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్ (ఇస్టా) పాల్గొన్న ఆయన బుధవారం అక్కడ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ను సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు.