Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైల్వే బోర్డు చైర్మన్కు బోయినపల్లి వినోద్ కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరీంనగర్ నుంచి ముంబయికి వెళ్లే లోకమాన్య తిలక్ రైలును తిరిగి ప్రారంభించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ రైల్వే బోర్డు చైర్మెన్ వినరు కుమార్ త్రిపాఠిను కోరారు. కరీంనగర్ నుంచి బయలుదేరి జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి, ఆర్మూర్, నిజామాబాద్ మీదుగా ముంబయికి వెళ్లే ఈ రైలు సర్వీసులను మొదటి దఫా లాక్డౌన్ సమయంలో రైల్వే బోర్డు నిలిపివేసిందని తెలిపారు. తాను కరీంనగర్ ఎంపీగా ఉన్న సమయంలో లోకమాన్య తిలక్ రైలును కరీంనగర్ నుంచి ముంబయికి ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ రైలు సేవలు నిలిచిపోవడంతో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లా ప్రజలకు ముంబయికి నేరుగా వెళ్లే అవకాశాలు లేకుండా పోయాయని ఆయన వివరించారు.