Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.8 లక్షల మేర అప్పులు
నవతెలంగాణ-బెజ్జంకి
కుటుంబ అవసరాలు, పంటల సాగుకు తీసుకొచ్చిన అప్పులు రూ.8లక్షల వరకు ఉండటం.. వాటిని ఎలా తీర్చాలని తీవ్ర మనస్తాపానికి గురైన రైతు ఇంట్లో ఉరేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దేవక్కపల్లి గ్రామంలో గురువారం జరిగింది. రైతు కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవక్కపల్లి గ్రామానికి చెందిన కరివేద బాపురెడ్డి(66) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తన రెండెకరాల భూమిలో వరి సాగు చేశాడు. బావిలో నీరు అడుగంటింది. కుటుంబ, వ్యవసాయ అవసరాల కోసం తన రెండెకరాల భూమిని బ్యాంకులో మాటిగేషన్ చేసి రూ.5 లక్షలు, పంట రుణం రూ.90 వేలు, ఇతరుల వద్ద రూ.2 లక్షలు, బంగారం ఆభరణాలు తనఖా పెట్టి అప్పులు చేశాడు. ఇటీవల భార్య అనారోగ్యానికి గురైతే చికిత్స చేయించాడు. అప్పులు వడ్డీలతో కలిపి పెరిగాయి. వాటి తీర్చడమెలా అంటూ బాపురెడ్డి దిగులు చెందాడు. గురువారం ఉదయం ఇంట్లో ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రి తరలించే క్రమంలోనే మృతిచెందాడు. రైతు కొడుకు కరివేద రాజతిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు హెడ్ కానిస్టెబుల్ తిలక్ తెలిపారు.