Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణను అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్ పరామర్శించారు. గురువారం హైదరాబాద్లోని ఆయన ఇంటికి వారు వెళ్లారు. ఇటీవల నారాయణ సతీమణి వసుమతిదేవి మరణించిన విషయం తెలిసిందే.