Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
విచ్చలవిడి మద్యం అమ్మకాలతో నేరాలు పెరుగుతున్నాయనీ, వాటిని అరికట్టాలని మాజీ ఎంపీ వి హనుమంతరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తాగుబోతులను చేసి సొమ్ము చేసుకుంటున్నదని విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. బార్షాపుల్లో పర్మిట్ రూములు ఏర్పాటు చేసి, మరీ తాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యపానంపై తిరగబడేందుకు మహిళలు రోడ్డు మీదకు రావాలని విజ్ఞప్తి చేశారు. తాగిన మైకంలో మందుబాబులు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. సీఎం కేసీఆర్ ఇప్పటికైనా కండ్లు తెరవాలని సూచించారు.