Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ నెల 27 నాటికి కేరళకు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నైరుతి రుతుపవనాలు సాధారణంగా వచ్చే తేదీ కంటే ఈ ఏడాది ముందుగానే ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవనాలు ఈ నెల 27వ తేదీ(నాలుగురోజులు అటుఇటు)నాటికి కేరళను తాకనున్నట్టు తెలిపింది. రుతుపవనాల ప్రారంభ, పురోగతి ప్రకారం నైరుతి రుతుపవనాలు సాధారణంగానైతే మే 22న అండమాన్ సముద్రం మీదుగా పురోగమిస్తాయి భూమధ్యరేఖను దాటి విస్తరించిన గాలులతో అనుబంధంగా రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రంలో, నికోబార్ దీవులు, ఆగేయ బంగాళాఖాతంలో కొన్ని భాగాలలో ఈ నెల 15 నాటికి ప్రవేశించే అవకాశం ఉంది. కోసాంధ్ర తీరం, దాని పరిసర ప్రాంతాల మీదరుగా నెలకొన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నది. రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కూడా పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 8 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. వచ్చే నాలుగైదురోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. శుక్రవారం కొమరంభీం అసిఫాబాద్ జిల్లా కేంద్రంలో అత్యధికంగా 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.