Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భారత రాజ్యాంగాన్ని మారుస్తామంటూ అహంకార పూరితంగా మాట్లాడిన ఎం పీ ధర్మపురి అరవింద్ను వెంటనే అరెస్టు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పీఆర్డీ) గౌరవాధ్యక్షులు ఎం జనార్దన్ రెడ్డి, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె వెంకట్, ఎం అడివయ్య శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. శాసనాలు చేసేది తామేననీ, భారతరాజ్యాంగాన్ని మార్చే హక్కు పార్లమెంటుకు ఉందంటూ ఆయన మాట్లాడారని తెలిపారు. సెక్యులర్ పదమే ఉండనీయబోమని మాట్లాడటం దేశద్రోహమవుతోందని పేర్కొన్నారు. హక్కుల కోసం మాట్లాడిన వారిపై రాజద్రోహం కేసుపెడుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ చేసిన విచ్చన్నకర వ్యాఖ్యలు వినిపించటం లేదా అని ప్రశ్నించారు.