Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రతి మున్సిపాల్టీ ప్రగతి ప్రస్థానంపై నివేదిక సిద్ధం చేయాలని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశించారు. రాష్ట్రంలోని కార్పొరేషన్ మేయర్లు, మున్సిపాల్టీల చైర్పర్సన్లు, కమిషనర్లతో శుక్రవారం హైదరాబాద్లో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మున్సిపాల్టీల అభివృద్ధి నివేదికలను జూన్ రెండో తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజల ముందుంచుతామని వెల్లడించారు. సిబ్బంది కొరతను అధిగమించేందుకు నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. వార్డు ఆఫీసర్ల వ్యవస్థ, ఇందుకు సంబంధించిన సిబ్బంది నియామకాలు కూడా త్వరలోనే పూర్తవుతాయని వెల్లడించారు.