Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిత్తశుద్ధి ఉంటే నా ప్రశ్నలకు సమాధానాలివ్వాలి: అమిత్షాకు కేటీఆర్ బహిరంగలేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎనిమిదేండ్లు గడిచినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్షను ప్రదర్శిస్తూనే ఉందని మంత్రి కెటి రామారావు విమర్శించారు. శనివారం తెలంగాణ పర్యటనకు వస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్షాకు ఆయన శుక్రవారం బహిరంగలేఖ రాశారు. తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉంటే తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి బీజేపీ చేస్తున్న అన్యాయాలపై అమిత్షాకు ఆయన ప్రశ్నలు సంధించారు. తెలంగాణపై బీజేపీ అదే కక్షను కొనసాగిస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. కేంద్రం కడుపు నింపుతున్న తెలంగాణ కడుపు కొట్టడం మానడం లేదని తెలిపారు. ప్రతిసారి వచ్చుడు.. స్పీచులు దంచుడు.. విషం చిమ్ముడు.. మళ్లీ పత్తా లేకుండా పోవుడు ఇదే బీజేపీ కేంద్ర నాయకులకు అలవాటుగా మారిందని పేర్కొన్నారు. ఇంకెంతకాలం తెలంగాణపై ఈ నిర్లక్ష్య ధోరణి అని ప్రశ్నించారు. రాష్ట్రానికి చట్టబద్ధంగా ఇచ్చిన హామీలనూ నెరవేర్చని బీజేపీ... గుజరాత్కు మాత్రం ఇవ్వని హామీలనూ ఆగమేఘాల మీద అమలు చేయడం దేనికి సంకేతమని తెలిపారు. ఆత్మగౌరవ పోరాటాలతో సాధించుకున్న తెలం గాణ అస్థిత్వాన్ని సైతం ప్రశ్నించడం బీజేపీకే చెల్లిందని ఆందో ళన వ్యక్తం చేశారు. రాష్ట్ర సమాజం చైతన్యవంతమైనదనీ, మరోసారి తెలంగాణ గడ్డపై అమిత్షా అడుగుపెడుతున్న వేళ... విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ప్రజల సాక్షిగా కేంద్రం దృష్టికి తేవడంతోపాటు, వాటి కోసం తెగేదాక కొట్లాడటం తమ బాధ్యత అని తెలిపారు.