Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 18న ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరుగనుంది. అందులో రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మెన్లు, అన్ని జిల్లాల కలెక్టర్లు, లోకల్ బాడీ కలెక్టర్లు, అన్ని జిల్లాల డీపీవోలు, అటవీశాఖ రాష్ట్ర స్థాయి అధికారులు, మున్సిపల్ కార్పోరేషన్ల మేయర్లు, కమిషనర్లు, తదితర సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 20 నుంచి జూన్ ఐదో తేదీ వరకు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహించనున్న విషయం విదితమే.