Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు?
- అమిత్షాకు ఎమ్మెల్సీ కవిత ప్రశ్నలవర్షం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పట్ల చూపుతున్న వివక్షపై సమాధానం చెప్పాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్షాను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. శనివారం రాష్ట్రంలో పర్యటించిన అమిత్షాను ఆమె వివిధ అంశాలపై ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన తరూ.3 వేల కోట్లకుపైగా ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ల బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారని ప్రశ్నించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి రూ.1,350 కోట్లు, జీఎస్టీ పరిహారం రూ.2,247 కోట్ల సంగతేంటని అడిగారు. ఎనిమిదేండ్లలో తెలంగాణ ఒక్క ఐఐటీ, ఐఐఎం, ఐసర్, త్రిపుల్ఐటీ, ఎన్ఐడీ, మెడికల్ కాలేజీ లేదా నవోదయ పాఠశాలలు ఇవ్వడంలో కేంద్రం ఎందుకు విఫలమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు రూ.24 వేల కోట్ల నిధులు ఇవ్వాలన్న నిటి ఆయోగ్ సిఫారసును కేంద్రం ఎందుకు విస్మరించిందో చెప్పాలన్నారు. కర్నాటకలో ఎగువ భద్ర నీటిపారుదల ప్రాజెక్టుకు, కెన్ బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా నిరాకరించడం బీజేపీ ప్రభుత్వ కపటత్వం కాదా?అని ఆమె ప్రశ్నించారు. ఆకాశాన్ని తాకుతున్న ధరలు, ద్రవ్యోల్బణంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.