Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టులకు భారీగానే దరఖాస్తులొస్తున్నాయి. శనివారం నాటికి లక్ష దరఖాస్తులు దాటాయి. ఈ ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కార్యదర్శి అనితా రామచంద్రన్ ఒక ప్రకటన విడుదల చేశారు. గతనెల 26న 503 పోస్టుల భర్తీకి తెలంగాణ తొలి గ్రూప్-1 నోటిఫికేషన్ను టీఎస్పీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. శనివారం నాటికి 1,05,740 దరఖాస్తులొచ్చాయని వివరించారు. ఆన్లైన్లో దరఖాస్తుల సమర్పణకు తుదిగడువు ఈనెల 31 వరకు అవకాశమున్నదని పేర్కొన్నారు. వన్టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్)కు సంబంధించి కొత్తగా 1,08,423 మంది, సవరణ చేసుకున్న వారు 2,28,088 మంది కలిపి 3,36,511 మంది అభ్యర్థులు పూర్తి చేసుకున్నారని వివరించారు. ఇతర వివరాలకు షషష.్రజూరష.స్త్రశీఙ.ఱఅ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.