Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గణపురం
చేతికొచ్చిన వరి పంటకు నీళ్లు పారించేందుకు వెళ్లిన రైతు ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో ఆదివారం జరిగింది. కుటుంబీకులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్వరాజ్పల్లి శివారు మేరపల్లెకు చెందిన గండు సంపత్(50) తన పంట పొలంలో నీళ్లు పారించేందుకు పొలం వద్దకు వెళ్ళాడు. మోరంచ ఒడ్డుకు ఉన్న మోటార్కు స్విచ్ వేస్తుండగా అప్పటికే విద్యుత్ లైన్ వైర్లు తెగిపోవడంతో గమనించకుండా దానికి తగిలాడు. దాంతో విద్యుద్ఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు.