Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమిత్ షాకు రేవంత్ ట్వీట్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రజల తరఫున తాము అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమే చెప్పలేదని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి విమర్శించారు. తుక్కుగూడలో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రసంగంపై స్పందించారు. అమిత్షా ప్రసంగం కొండంత రాగం తీసినట్టుగా ఉందని ఆయన ట్వీట్ చేశారు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిపై ఆర్భాటపు ప్రకటనలు మాత్రమే చేస్తున్నారనీ, అవినీతిపై ఆచరణ చర్యలు ఉండవని తేలిపోయిందని ఎద్దేవా చేశారు. 'అంతేలే షా జీ... మీ చీకటి మిత్రుడిపై ఈగ వాలనివ్వరుగా!' అంటూ ఆయన పేర్కొన్నారు.