Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
అధిక విద్యుత్ చార్జీలతో ప్రజలు అల్లాడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఇప్పటికే నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి పేదలు నానా అవస్థలు పడుతున్నారనీ, వారిపై ఇప్పుడు విద్యుత్ చార్జీల భారం మోపడం సమంజసం కాదన్నారు. తక్షణం పెంచిన చార్జీలను ఉపసంహరి ంచుకోవాలనీ, లేనిపక్షంలో ప్రజాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిఘటన తప్పదని సోమవారంనాడొక పత్రికా ప్రకటనలో హెచ్చరించారు.