Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జాతీయ వికలాంగుల హక్కుల వేదిక(ఎన్పీఆర్డీ) రాష్ట్ర నాయకులను అరెస్టు చేయటం అన్యాయమని ఆ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎం జనార్దన్రెడ్డి, అధ్యక్షులు కె వెంకట్, కోశాదికారి ఆర్ వెంకటేశ్ సోమవారం ఒక ప్రకటనలో ఖండించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సింగన్న గూడెంలో నిర్మించిన 480 డబుల్ బెడ్రూం ఇండ్లలో వికలాంగులకు ఐదు శాతం కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఇండ్లను అక్రమించుకోవటానికి ర్యాలీగా వెళ్లిన ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం అడివయ్య, సహాయ కార్యదర్శి వనం ఉపేందర్, రాష్ట్ర కమిటీ సభ్యులు బి స్వామి, కీసర వెంకట్ రెడ్డిలతో పాటు మరో 48మంది వికలాంగులను అరెస్ట్ చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. సమస్యలను పరిష్కరించలేని అధికారులు పోలీసులతో అక్రమ అరెస్ట్లు చేయించడం అన్యాయమని తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.