Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
- మొగ్దుంపూర్లో లబ్దిదారులకు ఇండ్ల పట్టాలు
నవతెలంగాణ- కరీంనగర్టౌన్
డబుల్ బెడ్ రూమ్స్తో పేదల సొంతింటి కల సాకారం అయిందని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపూర్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సోమవారం లబ్దిదారులకు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇండ్ల నిర్మాణంతో పేదల కల సాకారం అయిందన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 74ఏండ్లు పూర్తయినప్పటికీ పాలకులు ఎవరూ పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వాలన్న ఆలోచన చేయలేదని చెప్పారు. మొగ్దుంపూర్ గ్రామంలో 52 మందికిగాను 40 మందికి ఇండ్లను అందజేశామని, మిగిలిన 12 మందికి త్వరలోనే పట్టాలు ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్లాల్, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, జడ్పీటీసీ, ఎంపీటీసీ దేవనపల్లి పుష్ప అంజిరెడ్డి, పీఎసీఎస్ చైర్మెన్ ఆనందరావు, శ్రీనివాస్ సంపత్, జక్కన్న నరసయ్య, తహసీల్దార్ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.