Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించేందుకు దావోస్, యునైటెడ్ కింగ్డమ్లో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన మంత్రి కే తారకరామారావు అక్కడ బిజీ బిజీగా గడుపుతున్నారు. లండన్ విమానాశ్రయంలో ఆయనకు టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం నాయకులు ఘన స్వాగతం పలికారు. యూకే ఇండియన్ బిజినెస్ కౌన్సిల్ రౌండ్ టేబిల్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఆయన రాష్ట్రంలోని వ్యాపార వాణిజ్య అవకాశాలను వివరించారు.భారతదేశం కోణంలో నుంచి మాత్రమే తెలంగాణను చూడొద్దనీ,తమ రాష్ట్రంలోని వినూత్న, విప్లవాత్మక విధానాలు, అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన అక్కడి పెట్టుబడిదారులను కోరారు. సమావేశంలో డెలాయిట్,హెచ్ఎస్బీసీ, జేసీబీ, రోల్స్ రాయిస్ వంటి పలుకంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.మంత్రి వెంటపరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్తో పాటు అధికార ప్రతినిధి బృందం ఉంది.