Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్ బ్యూరో
పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ, మరికొందరికి అదనపు శాఖల బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యాశాఖ కార్యదర్శిగా వాకాటి కరుణ నియమితులయ్యారు. ఎన్నికల సంఘం అదనపు సీఈఓ పనిచేస్తున్న డాక్టర్ జ్యోతి బుద్దప్రకాశ్ (2002)ను చేనేత, జౌళిశాఖ కార్యదర్శిగా నియమించారు. ఆయనకే రవాణాశాఖ కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్న రాహుల్ బొజ్జ (2000)కు రిజిస్ట్రేషన్, స్టాంపుల కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సయద్ అలీ ముర్తజా రిజ్వి (1999)కి కుటుంబ సంక్షేమం, ఔషధ నియంత్రణ సంచాలకులుగా, ముఖ్యమంత్రి కార్యదర్శి వీ శేషాద్రి (1999)కి సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. పంచాయతీ రాజ్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా (1998)కు యువజన సర్వీసులు, పర్యాటక శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.