Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12 గొర్రెల మృత్యువాత
నవతెలంగాణ-నంగునూరు
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాల్పేట గ్రామంలో గురువారం తెల్లవారుజామున గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేశాయి. దాడిలో 12 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. వెటర్నరీ డాక్టర్ శ్రీకాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన 20 గొర్రెలకు వైద్యం అందించారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితుడు పరమాండ్ల కనకయ్య కోరారు. కాపరి పరమాండ్ల కనకయ్యను యాదవ సంఘం సీనియర్ నాయకులు గుండెల్లి రాజయ్య, నంగునూరు మండల యాదవ సంఘం అధ్యక్షులు వడితం కిరణ్ కుమార్ యాదవ్ ఓదార్చారు. ఈ విషయాన్ని మంత్రి హరీశ్రావుకు, గొర్రెలకాపరుల సహకార యూనియన్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుల పోచబోయిన శ్రీహరి యాదవ్ దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వారి వెంట సంఘం అధ్యక్షులు పరమాండ్ల మల్లేశం తదితరులు ఉన్నారు.