Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రూప్ 4 నోటిఫికేషన్పై సన్నాహక సమావేశంలో సీఎస్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో గ్రూప్ 4 పోస్టుల నోటిఫికేషన్ జారీపై గురువారం హైదరాబాద్లోని బీఆర్కే ఆర్ భవన్లో ఉన్నత స్థాయి సమా వేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఛైర్మెన్ డా.బి.జనార్దన్ రెడ్డితో పాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. గ్రూప్ 4 కేడర్ కింద త్వరలో 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు.
2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వం 95 శాతం పోస్టులు స్థానికులకే కేటాయించిందనీ, మిగిలిన ఐదు శాతం పోస్టులు కూడా స్థానికులకే దక్కుతాయని సీఎస్ అన్నారు. ఇటీవల, గ్రూప్ వన్ కింద 503 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రక్రియను ప్రారంభించింది. పోలీసు రిక్రూట్మెంట్ ప్రక్రియ కూడా కొనసాగుతుండగా, విద్యాశాఖకు కూడా టెట్ నిర్వహణకు అనుమతిచ్చినట్టు సీఎస్. తెలిపారు.
గ్రూప్ 4కు సంబంధించి రోస్టర్ పాయింట్ల వివరాలతో పాటు సంబంధిత సమాచారాన్ని ఈ నెల 29లోగా పబ్లిక్ సర్వీస్ కమిషన్కు అందజేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అన్ని జూనియర్ అసిస్టెంట్ లేదా తత్సమాన పోస్టుల డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించారు. సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ క్యాడర్లలో ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేసి, తద్వారా ఏర్పడిన జూనియర్ అసిస్టెంట్ ఖాళీలను కూడా నోటిఫై చేయాలని పేర్కొన్నారు.