Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
తెలంగాణ రాష్ట్రం అన్ని అంశాల్లోనూ పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన ప్రాంతమని రాష్ట్ర ఐటీ, పారిశ్రామిక, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. లండన్లోని భారత హై కమీషన్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అనేక రంగాల్లో తెలంగాణ భారత దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తున్నదనీ, రాష్ట్ర విజయాలను భారతదేశ విజయాలుగా పరిగణిస్తూ, ప్రపంచానికి చాటాల్సిన అవసరమున్నదని అక్కడి ఎన్ఆర్ఐలకు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన లండన్ నెహ్రూ సెంటర్లో జరిగిన సమావేశంలో భారత్,బ్రిటన్ దేశాలకు చెందిన పలువురు కీలక వ్యాపారవేత్తలు, ఇండియన్ డయాస్పోరా ముఖ్యులతో భేటీ అయ్యారు. డిప్యూటీ హై కమిషనర్ సుజిత్ జొరు ఘోష్, నెహ్రూ సెంటర్ డైరెక్టర్ అమిష్ త్రిపాఠి ఆధ్వర్యంలో జరిగిన చర్చాగోష్టిలో మంత్రి పాల్గొన్నారు.