Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జయశంకర్ ఊరిలో రచ్చ బండ ప్రారంభం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతు డిక్లరేషన్ను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నిర్ణయించిన కాంగ్రెస్...శనివారం హన్మకొండ జిల్లాలోని ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అక్కంపేటలో రచ్చబండ నిర్వహించనున్నది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి పాల్గొంటారు. శనివారం ఉదయం హైదరాబాద్లో రాజీవ్గాంధీ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించనున్నారు. అక్కడ నుంచి బయలు దేరి ఒంటిగంటకు అక్కంపేటకు చేరుకుంటారు. అక్కడ ఆయన రైతు సమస్యలపై రచ్చబండ నిర్వహించనున్నారు. 'తెలంగాణ ఉద్యమానికి పాటలే ప్రాణమని యాది మరిస్తివా కేసీఆర్. పాటతో నిన్ను ప్రశ్నిస్తున్నందుకు కేసులు పెట్టి అణచివేస్తావా? ఈ వేధింపులకు మేము భయపడం. నీ అరాచకాలను ప్రశ్నించేందుకు గొంతెత్తుతూనే ఉంటాం' అని రేవంత్ ట్వీట్ చేశారు.