Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో రూ.28,615 కోట్లతో హైవేల నిర్మాణం
- 10 ప్రాజెక్టులలో ఏడింటికి భూసేకరణ పూర్తి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి -హైదరాబాద్
తెలంగాణ జాతీయ రహదారుల నిర్మాణంపై నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) దష్టి సారించింది. ఈ ఏడాది రూ.28,615 కోట్ల వ్యయంతో 715 కిలోమీటర్ల మేర ఉండే, 10 ప్రాజెక్టులకు ఎన్హెచ్ ఏఐ అధికారులు టెండర్లు ఫైనల్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అంశాలపై ఆ విభాగ అధికారులు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించారు.
రెండు ప్రాజెక్టులదే సింహభాగం
ఈ ఏడాది విస్తరించనున్న జాతీయ రహదారుల్లో రెండు ప్రాజెక్టులకే అధికంగా ఖర్చు చేయనున్నారు. వీటిలో నాగ్పూర్ -విజయవాడ 163జీ హైవేను 311 కిలోమీటర్ల మేరకు మూడు ప్యాకేజీలుగా రూ.8994 కోట్లతో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు రెండేండ్ల కిందే భూసేకరణ పూర్తయిందని, కొన్ని ప్యాకేజీల్లో రోడ్డు నిర్మాణం కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) సంగారెడ్డి-నర్సాపూర్-తుఫ్రాన్ -చౌటుప్పల్ (ఉత్తరభాగం)ను 158కిలోమీటర్లను రూ.11,590 కోట్లతో విస్తరించ నున్నారు. ఈ మెగా ప్రాజెక్టు భూసేకరణకు కేంద్ర ప్రభుత్వం రెండు గెజిట్లను విడుదల చేసింది. ఈ ప్రాజెక్టుకు భూముల కోల్పోతున్న రైతులు, ప్రైవేటు వ్యక్తుల నుంచి అధికారులు అభ్యంతరాలను స్వీకరిం చి, పరిష్కరించే పనిలో నిమగమయ్యారు. ఈ ఏడాది చేపట్టనున్న ఈ ఏడు ప్రాజెక్టులలో తొండప ల్లి-కొత్తూరు (12కిమీ), కాలకల్లు-గుండ్లపోచంపల్లి (17కిమీ) ప్రాజెక్టులను గత నెల 29న కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శంషా బాద్లో ఇటీవల శంకుస్థాపన చేశారు.
రాష్ట్రంలో వేగంగా హైవేల విస్తరణ - కష్ణప్రసాద్ , రీజనల్ ఆఫీసర్ , ఎన్హెచ్ఏఐ
రాష్ట్ర ఆవిర్భావం నుంచి తెలంగాణలో నేషనల్ హైవేల విస్తరణ వేగంగా జరుగుతున్నది. గత ఎనిమిదేండ్లలో సుమారు 2,500 కిలోమీటర్ల విస్తరణ పెరిగింది. ఈ హైవేలను గ్రీన్ ఫీల్డ్ , బ్రౌన్ ఫీల్డ్ పద్ధతిలో నిర్మిస్తున్నాం. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుకు ఇప్పటికే రెండు గెజిట్లు విడుదలచేశాం. అభ్యంతరాల స్వీకరణను స్ధానిక ఆర్డీవోలు తీసుకుంటున్నారు. నాగపూర్ - విజయవాడ సెక్షన్ లో భాగంగా మంచిర్యాల నుంచి వరంగల్ , ఖమ్మం మీదుగా విజయవాడ వరకు ప్రాజెక్టుకు ఈ ఏడాదిలో టెండర్లు పిలుస్తాం. ఈ పది ప్రాజెక్టులలో ఏడు ప్రాజెక్టులకు భూసేకరణ పూర్తయింది.
ఈ ఏడాది టెండర్లు ఖరారు చేయనున్న
ప్రాజెక్టుల వివరాలు
- కరీంనగర్ - వరంగల్ ,68 కిమీ ,రూ. 2146.86 కోట్లు ఎన్ హెచ్ 563
- తొండపల్లి- కొత్తూరు,12 కిమీ, రూ.541.60 కోట్లు ఎన్ హెచ్ 44
- కాలకల్లు- గుండ్లపోచంపల్లి ,17కిమీ రూ.955.50 కోట్లు ఎన్ హెచ్44
- జగిత్యాల- కరీంనగర్ 59 కిమీ, రూ.1900 కోట్లు ఎన్ హెచ్ 563
- డియెసుగర్ -జడ్చర్ల ప్యాకేజ్ 1 , 44కిమీ రూ.1375 కోట్లు, ఎన్ హెచ్ 167
- మరికల్ -జడ్జర్ల ప్యాకేజ్ 2 46కిమీ ,రూ.1112 కోట్లు ఎన్ హెచ్ 167
- మంచిర్యాల - వరంగల్ , 112 కిమీ, రూ.2795 కోట్లు, ఎన్ హెచ్ 163జి
- వరంగల్ -ఖమ్మం 109కిమీ రూ.3088 కోట్లు ఎన్ హెచ్ 163జి
- ఖమ్మం - ఏపీ బార్డర్ ,90కిమీ, రూ.3111 కోట్లు ఎన్ హెచ్ 163జి
- సంగారెడ్డి-నర్సాపూర్-తుఫ్రాన్- చౌటప్పల్
( ఆర్ ఆర్ ఆర్ ) 158కిమీ రూ.11590 కోట్లు ఎన్ హెచ్ 161ఏఏ