Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్కు తమ్మినేని లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
యాదగిరిగుట్ట దేవాలయం వద్ద ఆటో కార్మికుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు శనివారం ఆయన లేఖ రాశారు. యాదగిరిగుట్టలో గత 30 ఏండ్లుగా ఆటోల్లో నిరంతరం భక్తులు కింది నుంచి ఆలయంపైకి వెళ్తున్నారని తెలిపారు. దేవాలయం అభివృద్ధి చేసి పున:ప్రారంభించిన తర్వాత ఆలయ అధికారులు ఎలాంటి ఆదేశాల్లేకుండా ఏకపక్షంగా ఆటోలు పైకి వెళ్లడానికి అనుమతి లేదంటూ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. దీంతో ఆటోలపై ఆధారపడ్డ 300 కుటుంబాలు వీధిన పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా వారు కుటుంబాలతో సహా ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని విమర్శించారు. ఆర్టీసీ బస్సులు లేనప్పుడు, భక్తుల రద్దీ సమయాల్లో గుట్టపైకి, వసతి గృహాలకు ప్రయాణీకులు ఆటోల్లో వెళ్లేవారని గుర్తు చేశారు. వృద్ధులు, వికలాంగులు, చిన్నపిల్లలు, ఆలయ సిబ్బంది, పూజారుల రాకపోకలకు ఇంతకాలం సౌకర్యంగా ఉన్న ఆటోలను అకస్మాత్తుగా నిలిపివేయ టంపై ప్రయాణీకులూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నార ని తెలిపారు. పేద కుటుంబాల యువత ఫైనాన్స్, అప్పులు చేసి ఆటోలు కొనుక్కుని ఆలయం వద్ద నడుపుకుంటూ వారి కుటుంబాలను పోషించుకుం టున్నారని పేర్కొన్నారు. ఆటోలను అనుమతించకపో తే ఉన్న ఉపాధి కోల్పోతారని తెలిపారు. సీఎం కేసీఆర్ తక్షణమే జోక్యం చేసుకుని ఆలయంపైకి ఆటోలు వెళ్లడానికి అనుమతిం చేందుకు ఆలయ ఈవోకు తగు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.