Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చమురు ధరల తగ్గింపుపై హరీశ్రావు
- కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై హరీశ్రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో కేంద్రం పెంచింది బారానా... తగ్గించింది చారానా అని ఆర్థిక మంత్రి టి హరీశ్రావు విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై ఆయన ఆదివారం స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పన్నులు పెంచలేదని తెలిపారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినపుడు వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉండేదనీ, ఇప్పుడు రూ.వెయ్యిపైన ఉందని వివరించారు. వంటగ్యాస్ సిలిండర్పై రూ.600పెంచి రూ.200తగ్గించారని పేర్కొన్నారు. అదీ అందరికీ తగ్గించకు ండా ప్రధానమంత్రి ఉజ్వల్ పథకం లబ్దిదారులకే వర్తింపచేశారని తెలిపారు. కేంద్రం ధరలను తగ్గించడమంటే అది బోగస్ అని విమర్శించారు.