Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోస్టర్ ఆవిష్కరించిన రైతు సంఘం నేతలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మారుతున్న పరిస్థితుల్లో పంటల ప్రణాళిక ఎలా ఉండాలనే అంశంపై అరిబండి ఫౌండేషన్, తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర సదస్సు జరగనుంది. ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో సదస్సుకు సంబంధించిన పోస్టర్ను ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు, సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్రావు, టి సాగర్, సహాయ కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ తదితరులు ఆవిష్కరించారు. అరిబండి లక్ష్మినారాయణ నాలుగోవ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్న ఈ సదస్సులో వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ రాజిరెడ్డి, అరిబండి ఫౌండేషన్ చైర్మెన్ అరిబండి ప్రసాదరావు, కార్యదర్శి డాక్టర్ అరిబండి మనోహర్, కోశాధికారి డాక్టర్ అరిబండి అనిల్కుమార్, సభ్యులు డాక్టర్ పీవీ అమర్నాథ్ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహ్మారెడ్డి తదితరులు పాల్గొంటారని తెలిపారు.