Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు మంగళవారంతో ముగియ నున్నాయి. ఈనెల ఆరో తేదీన ఈ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 4,64,626 మంది, ద్వితీయ సంవత్సరంలో 4,42,767 మంది కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వారికోసం 1,443 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈనెల 12 నుంచి రాష్ట్రంలోని 14 కేంద్రాల్లో మూల్యాంకనం ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఏడాది మంచిర్యాల, నిర్మల్లో కొత్తగా మూల్యాంకన కేంద్రాలను ప్రారంభించారు. వచ్చేనెల 20వ తేదీలోపు ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. చివరిరోజు సోమవారం ఇంటర్ ప్రథమ సంవత్సర మోడ్రన్ లాంగ్వేజి పేపర్-1, జాగ్రఫి పేపర్-1 పరీక్షలు జరిగాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఒక ప్రకటనలో తెలిపారు. 490 మంది దరఖాస్తు చేసుకున్నారనీ, వారిలో 471 (96.2 శాతం) మంది హాజరయ్యారని వివరించారు. 19 (3.8 శాతం) మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.