Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలిరోజు 99 శాతం మంది హాజరు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. వచ్చేనెల ఒకటో తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. తొలిరోజు సోమవారం ఫస్ట్ లాంగ్వేజి పరీక్షకు రెగ్యులర్ విద్యార్థులు 5,08,143 మంది దరఖాస్తు చేసుకున్నారని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. వారిలో 5,03,041 (99 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారని వివరించారు. 5,102 (ఒక శాతం) మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. 158 మంది ప్రయివేటు విద్యార్థుల్లో 89 మంది హాజరయ్యారనీ, 69 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని వివరించారు. తొలిరోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని పేర్కొన్నారు. ఈ పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 2,861 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు సరైన వసతులను కల్పించలేదంటూ ఆదిలాబాద్ జిల్లాల్లో కలెక్టర్ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.