Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యుల చేతులమీద ఎన్నిక పత్రం స్వీకరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాజ్యసభ సభ్యులుగా ఒద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం అసెంబ్లీ ఆవరణంలో అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యుల చేతుల మీదుగా ఆయన ఎన్నిక పత్రాన్ని స్వీకరించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినరుభాస్కర్, ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి చైర్మెన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తాతా మధు, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తదితరులు పాల్గొన్నారు.