Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమి సలహాదారులు వై సత్యనారాయణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పకడ్బందీ ప్రణాళికతో అందులోనూ తెలుగు సాహిత్యంతో అత్యంత సులువుగా సివిల్ సర్వీసెస్లో విజయం సాధించొచ్చని ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమి చీఫ్ గార్డెనర్, సలహాదారులు, ఎక్స్ ఐఓఎఫ్ఎస్, వాణిజ్య పన్నుల శాఖ రిటైర్డ్ అడిషనల్ కమిషనర్ వై. సత్యనారాయణ అన్నారు. యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్ సర్వీసెస్ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించడం అత్యంత సులువైన పద్ధతి అని చెప్పారు. సోమవారం హైదరాబాద్లోని ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమి ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దాని కోసం విద్యార్థులు పకడ్బందీ ప్రణాళిక, యూపీఎస్సీ సూచిస్తున్నటువంటి ప్రముఖమైన పుస్తకాలను తప్పకుండా అధ్యయనం చేయాలని సూచించారు. దానికి కావలసినటువంటి ప్రణాళికను రూపొందించుకోవాలని చెప్పారు. ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమిలో అటువంటి మెళకువలతో కూడిన విద్యను అందించడానికి తమ బోధనా సిబ్బంది సిద్ధంగా ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమి పాలనాధికారి కె సతీష్ కుమార్ , విద్యార్థిని విద్యార్థులు కార్యాలయ సిబ్బంది కె మురళీకృష్ణ, బి మమత, రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.