Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. ఈనెల ఆరో తేదీన ఈ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 4,64,626 మంది, ద్వితీయ సంవత్సరంలో 4,42,767 మంది కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వారికోసం 1,443 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈనెల 12 నుంచి రాష్ట్రంలోని 14 కేంద్రాల్లో మూల్యాంకన ప్రక్రియ ప్రారంభమైంది. చివరిరోజు మంగళవారం ఇంటర్ ద్వితీయ సంవత్సర మోడ్రన్ లాంగ్వేజి పేపర్-2, జాగ్రఫి పేపర్-2 పరీక్షలు జరిగాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఒక ప్రకటనలో తెలిపారు.