Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ కవితకు ఆహ్వానం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేరళ అసెంబ్లీ ఆధ్వర్యంలో జరగనున్న ప్రతిష్టాత్మక జాతీయ మహిళా లెజిస్లేచర్ కాన్ఫరెన్స్కు రావాలంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆహ్వానం పంపించారు. ఈనెల 25 నుంచి 27 వరకు తిరువనంతపురంలో ఈ సదస్సు జరగనున్నది. జాతీయ స్థాయి నాయకులు హాజరవుతున్నారు. ఈనెల 26న నిర్ణయాధికార విభాగాల్లో మహిళల ప్రాతినిధ్యం అనే అంశంపై ఎమ్మెల్సీ కవిత ప్రసంగించనున్నారు. ఆమెతోపాటు ఈ అంశంపై ఉత్తరాఖండ్ అసెంబ్లీ గవర్నర్ రీటా ఖండూరీ, అనీరాజా ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి మోడరేటర్గా కేరళ ఎంపీ రేమ్యా హరిదాసు వ్యవహరిస్తారు. వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు.